ADB: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ PO దామోదర స్వామి తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ సమావేశంలో మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళా ఉద్యోగుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.