NLG: జిల్లాలోని 106 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. మొత్తం 19,672 మంది విద్యార్థులకు గాను 19,635 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసినట్లు తెలిపారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నాలుగు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారని పేర్కొన్నారు.