MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో కళాకారులు సందడి చేశారు. పాండు చెరువు కట్ట కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం నుంచి శుక్రవారం రాత్రి సీతారాముల శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.