ADB: ఉట్నూర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వేముల ఉషన్న అనారోగ్యంతో హైదరాబాదులోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన అంత్యక్రియల కోసం సంస్థ తరఫున దహన సంస్కారాల నిమిత్తం రూ. 30 వేల నగదును డిపో క్యాషియర్ చంద్రశేఖర్ మృతుని స్వగ్రామం ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు అందజేశారు.