MDCL: ప్రశాంతతకు మరో పేరుగా హబ్సిగూడలోని వీరరాజా రెడ్డి పార్కు నిలుస్తుంది. సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉద్యానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఒకేసారి 500 మంది యోగా చేసుకునే వీలుందని, స్థానిక ప్రజలందరూ సాయంత్రం, ఉదయం సమయాల్లో ఈ పార్కులో గడిపి, మానసిక సంతోషాన్ని, యోగ ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరచుకోవాలని అధికారులు సూచించారు.