NLG: నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు చేపట్టిన శిక్షణ శనివారం ముగిసింది. MPDO యాకూబ్ నాయక్ మాట్లాడుతూ.. పంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలు కీలకమని, గ్రామాభివృద్ధిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 16 మంది వార్డు సభ్యులకు ఆయన సర్టిఫికేట్లను అందజేశారు.