ASF: కాగజ్ నగర్ మార్కెట్ యార్డులో సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు AO రామకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ADA మనోహర్ హాజరై మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వాలు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.