NLG: పేద కుటుంబాలు ఇప్పటికే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుండగా పెంచిన వంట గ్యాస్ ధరలు వారికి గుదిబండగా మారాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల కూడలిలో ఆదివారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై మహిళలు వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు.