NLG: ముడిచమురు కొరత నేపథ్యంలో ప్రభుత్వం పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) పంపిణీని వేగవంతం చేయాలనుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా నల్గొండ, చిట్యాలను ఎంపిక చేశారు. ఇప్పటికే నల్గొండ వీటీ కాలనీలో పైలట్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. 24 గంటల్లోగా అనుమతులు మంజూరు చేయాలని సర్కార్ ఆదేశించింది.