NLG: తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, అధ్యక్షులు శాంతి కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రూ. 16.27 లక్షల రుణమాఫీ నిధులు విడుదలయ్యాయని, అర్హులందరికీ వర్తిస్తాయని మంత్రి తెలిపారు. బ్యాంకు రికార్డుల్లో లేని రుణమాఫీ ఫైళ్లను పరిష్కరించాలని కోరారు.