KMM: ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్ సూర్యాపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జావేద్ మృతి కాంగ్రెస్ పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.