WGL: నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఆకర్షితులై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో ఈ రోజు కుమ్మరి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.