NLG: శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం ఇవాళ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మెన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.