CTR: పెనుమూరులోని స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ సురేంద్రరెడ్డి తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, బీఫామ్ పూర్తి చేసి 18-35 ఏళ్లలోపు ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.