BDK: పాల్వంచ మండలాలలో గత 4 ఏళ్లుగా ఇసుక, మట్టి, కంకర మైనింగ్ కార్యకలాపాలు అధికంగా అక్రమంగా జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పాల్వంచ మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే అరికట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక, మట్టి ర్యాంపులను ప్రారంభించాలని బీజేపీ నాయకులు కలెక్టర్కు ఇవాళ ఫిర్యాదు చేశారు.