MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అవినాష్ అన్నారు. సోమవారం మండలంలోని అంకత్పల్లి, పోతపల్లి గ్రామాలలో స్థానిక ఎంపీడీవో సరోజ, ఎంపీడీవో శ్రీనివాస్ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.