PDPL: కాల్వ శ్రీరాంపూర్ KGBV పాఠశాలను కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించారు. విద్యార్థులకు పొందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.