నిర్మల్ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు శుక్రవారం పలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు మాట్లాడుతూ.. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను పరిమితికి మించి హోటళ్లలో వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.