JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ శ్రీధర్ రావు, పాలకమండలి, ఈఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.