BDK: ఇల్లందు కూరగాయల మార్కెట్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. కరెంట్ స్తంభంపై నుంచి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో సదరు యువకుడు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.