GDWL: మనం తినే ఆహారం కల్తీ అయితే అది ప్రాణాంతకం, అందుకే ప్రతి హోటల్, రెస్టారెంట్ పక్కాగా నిబంధనలు పాటించాల్సిందే అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో వంటకు వాడే నూనెలు, ఇతర సరుకుల నాణ్యతను తరచూ పరిశీలించాలన్నారు.