BDK: ఇల్లందు మున్సిపాలిటీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం 3వ వార్డులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్డు కౌన్సిలర్ అజ్మీరా వంశీ ఆధ్వర్యంలో మురుగు కాలువలను శుభ్రం చేయించి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణాలన్నీ సుందరంగా మారుతాయని అన్నారు.