MHBD: సీరోల్ మండలం కొత్తూరు గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ పగడాల కృష్ణారెడ్డి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.