W.G: ఉండి మండలం యండగండికి చెందిన మాజీ మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాధరాజుకు పితృవియోగం కలిగింది. రంగనాధరాజు తండ్రి నరసింహరాజు స్వగృహంలో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచంట నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్గా రంగనాధరాజు ఉన్నారు. నరసింహరాజు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.