MDK: నూతన విద్యాపాలసిలో ప్రతి గ్రామపంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి తరగతికి ఒక టీచర్ను, ప్రీ ప్రైమరీకి ఒక టీచర్ను కేటాయించాలని ఎస్జిటియు రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తూప్రాన్లో రాష్ట్ర శాఖ సమావేశం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, మధుసూదన్, జింక అశోక్ పాల్గొన్నారు.