జగిత్యాల పట్టణం 6వ వార్డులో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వాణి, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, కౌన్సిలర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకుల ప్రజలు పాల్గొన్నారు.