KMM: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జగన్నాధపురం సర్పంచ్ తాళ్లూరి స్వప్న అన్నారు. ఇవాళ చింతకాని మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మద్యపానం, పొగాకు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నారు.