KMM: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు క్వారీ గుంతలో గల్లంతైన ఘటన సత్తుపల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివ(13), నాగబాబు (14) ఇవాళ మధ్యాహ్నం మెట్టాంజనేయస్వామి ఆలయం వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగారు.