SRPT: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ మోతే మండలం బుర్కచర్లలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీపీఎం గ్రామ కార్యదర్శి కొండ భాస్కర్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యవసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై గ్యాస్ ధరల పెంపు పెనుభారంగా మారిందని మండిపడ్డారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.