RR: కేశంపేట మండలంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి వ్యక్తికి చేరేలా పనిచేయటం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా అంత్యోదయ కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు.