NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా మంగళవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 6206మంది విద్యార్థులకు గాను 6018 మంది పరీక్ష రాశారని, 188 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు. కడెం మామడ, వశిష్ట జూనియర్ కళాశాలలో తనిఖీ చేసినట్లు DIEO తెలిపారు.