WNP: ఆత్మకూరు పట్టణంలో గురువారం వాసవి కాలనీలో నూతనంగా నిర్మించిన వాసవి కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైశ్య సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.