NZB: ధర్పల్లి ఎంపీపీ కార్యాలయంలో 10 గ్రామాలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు మంగళవారం రెండవ విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పరిపాలన వ్యవహారాలు, సభ్యుల బాధ్యతలపై ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. వార్డు సభ్యులు తమ బాధ్యతలను తెలుసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.