RR: కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా కొత్తపేటలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని కేశంపేట ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని, విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.