SRPT: ఇంటర్ ఫలితాల్లో హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా సెకండ్ ఇయర్లో వనజ 987 మార్కులు సాధించగా, ఫస్ట్ ఇయర్ ఈశ్వరి తేజ 470కి 467 మార్కులతో సత్తా చాటింది. రికార్డు స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ గీత, అధ్యాపకులు అభినందించారు.