కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు.