MBNR: భూత్పూర్ మున్సిపాలిటీలోని రైతు వేదిక వద్ద భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట మండలాల రైతులకు మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్పింక్లర్స్, హార్టికల్చర్ ఇక్విమెంట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతు సంక్షేమమే ధేయ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.