NRML: తానూర్ మండలంలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సందర్శించారు. గురువారం రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆదాయ వ్యయాలు, ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల వినియోగంపై సభ్యులకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు నిధుల వినియోగంపై పూర్తి పట్టు సాధించాలని ఆయన సూచించారు.