నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రముఖ ఆలయాలు శ్రీ చక్రేశ్వర శివ మందిరము, శ్రీ మారుతి మందిరము మంగళ వారం మూతపడ్డాయి చంద్ర గ్రహణం ఉన్నందున ఉదయ పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టి హారతి చేసి 7గంటలకు ఆలయాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గణేష్ శర్మ, ప్రవీణ్ శర్మలు మాట్లాడుతూ.. గ్రహణం వీడిన తర్వాత రాత్రి 7:30లకు సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు.