WGL: ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాధర్నాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ వరంగల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శనివారం పర్వతగిరి మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం సరైంది కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.