MDK: పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో ఈనెల 11న ఇసుక వేలం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సతీశ్ తెలిపారు. గత నెల 26న మంజీరా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 834 క్యూబిక్ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మైనింగ్ అధికారుల సూచనల మేరకు ఆ ఇసుకను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు.