ADB: సోనాల మండలంలోని కోట (కే) బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ శుక్రవారం పర్యటించారు. గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గజేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.