BHPL: మహాదేవపూర్ మండలంలో మసీదుల నిర్మాణం, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కోసం రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు స్థానిక మైనార్టీ సమాజం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం మండల కేంద్రంలో IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్, మైనార్టీ నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.