తిరుపతి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మార్చి 24న అధికారులతో కలెక్టరేట్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యుటేషన్లు, భూ రీసర్వే, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలైన PGRS, IVRS ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.