WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీ పై మంగళవారం సాయంత్రం ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో మిర్చి తొడిమలతో కల్తీ చేసి కారం తయారు చేస్తున్నట్లు గుర్తించి, 70 కిలోల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.