WGL: నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ధరించి వాహనం నడపాలని కోరారు.