VZM: గంట్యాడ మండలంలోని కొత్త వెలగాడలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనికి వెళ్లిన కన్నయ్య (65) అనే వ్యక్తి మంగళవారం పని చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి కూలీలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ఎంపీడీవో రమణమూర్తి తెలిపారు. పని స్థలంలోనే మరణించినందున ఎక్స్గ్రేషియా చెల్లించేలా సిఫార్సు చేశామని పేర్కొన్నారు.