HNK: శాయంపేట మండలం మైలారం గ్రామంలో కోస్టల్ పనుల కారణంగా భూములు కోల్పోయిన రైతులు తమపై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కొందరు తమను వేధించారని, డబ్బులు వసూలు చేశారని వ్యాప్తి చేస్తున్న ప్రచారాలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ఎవరూ వేధించలేదని, ఎలాంటి అధికారులు లేదా నాయకులు డబ్బులు కోరలేదని, తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు