VSP: సింహాచలం కొత్త గోసాల కృష్ణాపురంలో నిర్వహించిన ‘శబల-2026 సుస్థిర జీవన ఉత్సవం’లో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులకు బహుమతులు అందజేసి, వివిధ స్టాల్స్ పరిశీలించారు. సాంప్రదాయ ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వాటిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.