SKLM: పలాస కిడ్నీ మార్పిడి బాధితురాలు హేమశ్రీని ఎమ్మెల్యే గౌతు శిరిష ఆదివారం పరామర్శించారు. ఇటీవల కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న హేమశ్రీ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న తీరును వైద్యులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.